సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ దీప్కే (కుడి), సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు వేలాది మంది యువకులు జూన్ 20 నుంచి నిరసనలు చేపట్టారు.

సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష, పార్లమెంట్ మార్చ్ సమయంలో దిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్ వంటి అనేక సంఘటనలను ఎదుర్కొని సాగిన ఈ నిరసనల ఫలితంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

దేశమంతటా చర్చనీయాంశమై, మద్దతు కూడగట్టుకున్న ఈ పోరాటం ఎలా సాగిందో ఇక్కడ చూద్దాం.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Reuters

అభిజిత్ దీప్కే ప్రారంభించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 6న తన తొలి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నిరసనకారులు ఆందోళన లేవనెత్తారు. ఆ ఆందోళన ఒక పెద్ద ఉద్యమానికి ఆరంభం మాత్రమేనని అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో, జూన్ 20న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసనను ప్రారంభించారు.

పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావడం తదితర డిమాండ్లను కేంద్రం ముందుంచారు.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జూన్ 28వ తేదీన విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాంగ్‌చుక్ ఇందులో పాల్గొనడం జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 18వ తేదీన దిల్లీ పోలీసులు నిరసన స్థలం నుంచి సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (ఎడమ), 2026 జులై 18న న్యూదిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దృశ్యం.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత, జులై 20న 'పార్లమెంట్ మార్చ్'కు సీజేపీ పిలుపునిచ్చింది.

అయితే, 'పార్లమెంట్ మార్చ్'కు సీజేపీ ఎలాంటి అనుమతి కోరలేదని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని జులై 19(పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు రోజు)న దిల్లీ పోలీసులు ప్రకటించారు.

జులై 20న, వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు.

ఆ సమయంలో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బారికేడ్లు, లాఠీచార్జ్, టియర్‌ గ్యాస్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఆ ఘటనలో కొందరు యువకులు, పోలీసులు గాయపడ్డారు. దీంతో, పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు తలెత్తాయి.

కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ సంఘటన జంతర్ మంతర్ నిరసనను ఒక ముఖ్యమైన జాతీయ రాజకీయ అంశంగా మార్చింది.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాఠీచార్జ్‌తో గాయపడి రోడ్డుపై పడిపోయిన నిరసనకారులు (చిత్రం: జులై 20).
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీజేపీ మద్దతుదారులను చెదరగొట్టడానికి, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం చేస్తూ, దాడి చేసిన అనేక చిత్రాలు కూడా విడుదలయ్యాయి (చిత్రం: జులై 20).

ఆ తర్వాత జులై 21 నుంచి 23 మధ్య, జంతర్ మంతర్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు, పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.

పోలీసుల చర్యలపై దిల్లీ హైకోర్టు వివరణ కోరింది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు నిరసన స్థలానికి సమీపంలోని ఒక తటస్థ ప్రదేశంలో సీజేపీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పగిలిన దిల్లీ పోలీస్ బస్సు అద్దాలు (చిత్రం: జులై 20)

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

జులై 24న, సోనమ్ వాంగ్‌చుక్ ప్రభుత్వ హామీల నేపథ్యంలో జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో తన నిరాహార దీక్షను విరమించారు.

అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 20న పార్లమెంట్ మార్చ్ సమయంలో, నిరసనకారులపై పోలీసులు తీవ్రమైన బలప్రయోగానికి పాల్పడ్డారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 24వ తేదీన జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ముగించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రకటించింది.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, PTI

దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తరపున జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కాక్రోచ్ జనతా పార్టీ తరపున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చర్చల్లో పాల్గొన్నారు.

డిమాండ్లపై సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒకరోజు వరకు సమయం కోరిందని జులై 24న జరిగిన చర్చల ముగింపులో సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌లో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శనివారం (జులై 25న) కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, Getty Images

జవాబుదారీతనం, పరీక్షా విధానంలో సంస్కరణల డిమాండ్లను స్పష్టంగా చెబుతూనే, ఈ పరిణామాన్ని సీజేపీ ఒక భారీ విజయంగా అభివర్ణించింది.

"ఇది ప్రజాస్వామ్య విజయం, ఇది శాంతి, ఓర్పు, పట్టుదలకు లభించిన విజయం" అని సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు.

కాక్రోచ్ జనతా పార్టీ, ఆందోళనలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అభిజీత్ దీప్కే

ఫొటో సోర్స్, ANI

"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, కానీ నీట్ పరీక్ష అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అనే రెండు డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి" అని అభిజిత్ దీప్కే తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)