రుణమాఫీ కావాలంటూ ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చిన రైతు

రుణమాఫీ కావాలంటూ ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చిన రైతు
ప్రచురణ

రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు ఇలా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోకి ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురాలో జరిగింది. వెంటనే రుణమాఫీ చేయలంటూ ఆయన నినాదాలు చేశారు.

రుణమాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేదు.

దీంతో, వెంటనే రుణమాఫీ అమలు చేయాలని వివిధ ప్రాంతాల్లోని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)