ఆంధ్రప్రదేశ్‌: ఫుల్ ట్యాంక్, నో స్టాక్.. పెట్రోల్, డీజిల్ బంకుల్లో పరిస్థితి 9 ఫోటోలలో

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు.

ప్రతి ఒక్కరూ ‘ఫుల్ ట్యాంక్’ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు.

మరోవైపు రైతులూ డీజిల్ కోసం క్యాన్లతో బంకులకు క్యూ కట్టారు.

మరోపక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో వరి రైతులు, ఆక్వా సాగుదారులు డీజిల్‌ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డబ్బులు కడితే కానీ రిఫైనరీలు ట్యాంకులు పంపడం లేదని దొండపర్తిలోని బంకు యజమాని కృష్ణారావు అంటున్నారు.

గతంలో క్రెడిట్‌పై ఇచ్చేవారని, ఇప్పుడలా లేదని, అదే ఈ పరిస్థితికి కారణమని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.