'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయుల సందడి..

'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయుల సందడి..

న్యూయార్క్‌లో జరిగిన 'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయులు పాల్గొన్నారు.

ఈ ఏడాది థీమ్ 'కాస్ట్యూమ్ ఆర్ట్' కు తగ్గట్టుగా సెలబ్రెటీలు తమదైన శైలిలో మెరిశారు.

ఈ రెడ్ కార్పెట్ మీద కరణ్ జోహార్, ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా, అనన్య బిర్లా, సుధా రెడ్డి తదితరులు సందడి చేశారు.

ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ కోసం నిధుల సేకరణే కాకుండా.. సెలబ్రెటీలు, డిజైన్ హౌస్‌లు తమ అద్భుతమైన కళాత్మక ప్రదర్శనలను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)